మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లడం...: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-04-27T01:52:56+05:30 IST

మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లడం...: శైలజానాథ్

మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లడం...: శైలజానాథ్

విజయవాడ: తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.  బాలుడి మృతదేహాన్ని బైక్‌పై తరలించడం దారుణమన్నారు. రుయా ఘటన వైద్యశాఖ దుస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్​పై తరలించిన ఘటన అవేదన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి బైక్​పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్​పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో ఆరోగ్య రంగం దుస్థితిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. 

Updated Date - 2022-04-27T01:52:56+05:30 IST