పీఎం కేర్స్ ఫండ్‌కు సెయిల్ రూ. 30 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-01T00:28:43+05:30 IST

దేశంలోని అతిపెద్ద స్టీల్ మేకర్ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)

పీఎం కేర్స్ ఫండ్‌కు సెయిల్ రూ. 30 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద స్టీల్ మేకర్ అయిన స్టీల్ అథారిటీ  ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మంగళవారం పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 30 కోట్ల విరాళం అందించింది. సెయిల్ ఉద్యోగులు కూడా తమ ఒక రోజు వేతనమైన దాదాపు రూ. 9 కోట్లను సహాయనిధికి అందజేశారు. ఈ సందర్భంగా సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. దేశ సేవకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుత అత్యవసర సమయంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక అధికారుల సమన్వయంతో వివిధ ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఐసీయూ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, క్వారంటైన్ సదుపాయాలు, ఆసుపత్రులు, వారి సిబ్బంది కోసం శానిటైజర్లు వంటి వాటిని సమకూర్చినట్టు అనిల్ కుమార్ వివరించారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 1200 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-04-01T00:28:43+05:30 IST