పాఠశాలల్లో క్రీడా కోర్టు ఏర్పాటు చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2020-09-30T11:29:20+05:30 IST

నాడు-నేడు పథకానికి ఎంపికైన పాఠశాల ల్లో క్రీడా కోర్టును ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టరు ..

పాఠశాలల్లో క్రీడా కోర్టు ఏర్పాటు చేయాలి : జేసీ

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 29 : నాడు-నేడు పథకానికి ఎంపికైన పాఠశాల ల్లో క్రీడా కోర్టును ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టరు సాయికాంత్‌వర్మ అధికారులను ఆదేశించారు. కడప జయనగర్‌కాలనీ నా డు-నేడు డెమో పాఠశాలలో పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో వివిధ రకాల క్రీడా సింథటిక్స్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. వాటికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో శైలజ, సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఈఈ జనార్ధన్‌రెడ్డి, డీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో నారాయణ, గాయత్రిభాయి, సీఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T11:29:20+05:30 IST