కరోనాతో సీఐ సాయి రమేష్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-18T05:53:10+05:30 IST

రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో విజయవాడ క్రైమ్‌ సీఐ బోనం సాయిరమేష్‌ (52) కరోనాతో మృతి చెందారు.

కరోనాతో సీఐ సాయి రమేష్‌ మృతి

రాజమహేంద్రవరం సిటీ, మే 17: రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆసుపత్రిలో విజయవాడ క్రైమ్‌ సీఐ బోనం సాయిరమేష్‌ (52) కరోనాతో మృతి చెందారు. ఆయనకు భార్య ఉన్నారు. గతంలో ఆయన రాజమహేంద్రవరంలో పలు స్టేషన్లలో సీఐగా విధులు నిర్వహించారు. ఇటీవల వీఆర్‌లో ఉన్న ఆయన్ని తాత్కాలికంగా విజయవాడ క్రైమ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన ఆయన రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌కు చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. సీఐ సాయిరమేష్‌ మృతిపట్ల అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌, అడిషనల్‌ ఎస్పీలు, సహచర సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఐ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.   


Updated Date - 2021-05-18T05:53:10+05:30 IST