సాయి భక్తురాలు మృతి

ABN , First Publish Date - 2021-06-13T06:38:23+05:30 IST

ఉత్తరప్రదేశ రాష్ట్రానికి చెందిన దశాబ్దాలుగా సత్యసాయి భక్తురాలు పుట్టపర్తిలోనే నివాసముంటు ఇక్కడే తన ఆఖరిజీవితం గడపపాలని నిర్ణయించుకుంది.

సాయి భక్తురాలు మృతి

దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు

 పుట్టపర్తి, జూన 12: ఉత్తరప్రదేశ రాష్ట్రానికి చెందిన దశాబ్దాలుగా సత్యసాయి భక్తురాలు పుట్టపర్తిలోనే నివాసముంటు ఇక్కడే తన ఆఖరిజీవితం గడపపాలని నిర్ణయించుకుంది. శనివారం గౌరీదాస్‌(82)అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో కరోనా భయం, బంధువులు దగ్గరలో లేకపోవడం ఎవరూ అంతక్రి యలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కద్మత ఏఖల్క్‌ వెల్పేర్‌ సొసైటీ బృందం షామీర్‌,బాబావలి, షెక్షావలి, చాంద్‌, షాకీర్‌, దాదాఖలందర్‌లు వృద్ధురాలి శవాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ  హిందూసంప్రదాయ రీతిలో దహనసంస్కారాలు చేశారు. 

Updated Date - 2021-06-13T06:38:23+05:30 IST