సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘వాల్మీకి జయంతి’ ప్రత్యేక చర్చా కార్యక్రమం
ABN , First Publish Date - 2020-10-30T22:15:24+05:30 IST
సాహితీ సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా వాల్మీకి జయంతి రోజున ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ వేదికగా జరగనున్న
రంగారెడ్డి: సాహితీ సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా వాల్మీకి జయంతి రోజున ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ వేదికగా జరగనున్న ఈ చర్చలో ప్రధాన వక్తగా దోరవేటి పాల్గొననున్నారు. దొరవేటి శతకాలు, కథలు, కథానికలు, గ్రంథాలు రాశారు. అవధాని, ఆంధ్రనాట్యంలో దిట్ట. చిత్రకళలో ప్రతిభ కలిగినవారు. మురళీ, తబలా వాద్య కారులు. ఈ నెల 31న సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని సాహితీ సమితి నిర్వాహకులు తెలిపారు. అనంతగిరి, రంగారెడ్డి జిల్లాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మరిన్ని వివరాలకు సాహితీ సమితి సంఘటనా కార్యదర్శి కృష్ణాగౌడ్ను 8328521624 నెంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.