సహారా గ్రూప్పై రూ.12 కోట్ల జరిమానా
ABN , First Publish Date - 2022-06-28T06:53:40+05:30 IST
సహారా గ్రూప్పై సెబీ మరోసారి కొరడా ఝళిపించింది.
న్యూఢిల్లీ: సహారా గ్రూప్పై సెబీ మరోసారి కొరడా ఝళిపించింది. సహారా గ్రూప్లోని సహారా కమోడిటీస్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్సీఎ్ససీఎల్), సహారా హౌసింగ్ ఇన్వె్స్టమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్హెచ్ఐసీఎల్) కంపెనీలపై రూ.12 కోట్ల జరిమానా విధించింది. 2008,2009 సంవత్సరాల్లో నిబంధనలకు విరుద్ధంగా పాక్షికంగా షేర్లుగా మార్చుకునే రుణ పత్రాలు జారీ చేసినందుకు గాను సెబీ ఈ చర్య తీసుకుంది. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్తో పాటు మరో ముగ్గురు డైరెక్టర్లు 45 రోజుల్లో ఈ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.