సాగర్ నీటి సమాచారం
ABN , First Publish Date - 2022-08-07T05:16:52+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం శనివారం నాటికి 569.90 అడుగులు ఉంది. ఇది 256.32 టీఎంసీలకు సమానం.
విజయపురిసౌత్, ఆగస్టు 6: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం శనివారం నాటికి 569.90 అడుగులు ఉంది. ఇది 256.32 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2,712 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 2,053, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 6,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వాటర్గా 76,515 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.70 అడుగులుంది. ఇది 213.88 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి శ్రీశైలానికి 74,515 క్యూసెక్కులు, రోజా నుంచి 62,040 క్యూసెక్కులు, మొత్తంగా శ్రీశైలం జలాశయానికి 1,35,555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
బ్యారేజి దిగువకు 37,100 క్యూసెక్కులు
తాడేపల్లి టౌన్: కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్కు వరదనీటి ఉధృతి క్రమేపీ పెరిగింది. కీసర, మునేరు, పాలేరు, మధిర, ముజినేపల్లి తదితర వాగుల నుంచి శనివారం సాయంత్రానికి 46,600 క్యూసెక్కుల వరదనీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 9,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 50 గేట్లను ఒకఅడుగు మేర ఎత్తి 37,100 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.