సాగర్ ఎన్నిక తర్వాత టీపీసీసీకి కొత్త సారథి
ABN , First Publish Date - 2021-04-16T09:28:25+05:30 IST
సాగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. సాగర్ ఎన్నికలో తమ అభ్యర్థి జానారెడ్డి గెలుపు తథ్యమని అన్నారు.
జానారెడ్డి గెలుపు ఖాయం: మాణిక్కం ఠాగూర్
హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): సాగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. సాగర్ ఎన్నికలో తమ అభ్యర్థి జానారెడ్డి గెలుపు తథ్యమని అన్నారు. అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, కవిత నగలు.. పెరగడం కాదని అన్నారు. సాగర్లో పోలీసు, మద్యం, మనీ పవర్ను కేసీఆర్ ఉపయోగిస్తున్నారని, వీటిని నియంత్రించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. మానవతారాయ్ని పోలీసులు అరెస్టు చేసి హింసించడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు కేసీఆర్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీజేపీ విజయం నీటి బుడగలాంటిదని, సాగర్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు.