సాగర్ సిమెంట్స్ ఆదాయం రూ.397 కోట్లు
ABN , First Publish Date - 2021-07-29T05:51:44+05:30 IST
సిమెంట్ గిరాకీ, ధరలు ఆశావహంగా ఉండడంతో జూన్తో ముగిసిన త్రైమాసికానికి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సిమెంట్ గిరాకీ, ధరలు ఆశావహంగా ఉండడంతో జూన్తో ముగిసిన త్రైమాసికానికి సాగర్ సిమెంట్స్ ఏకీకృత ప్రాతిపదికన రూ.50 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.రూ.36 కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం కూడా 50 శాతం వృద్ధితో రూ.265 కోట్ల నుంచి రూ.397 కోట్లకు చేరింది.