‘పల్లె ప్రగతి’తో సురక్షితంగా తెలంగాణ: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-08-11T09:14:11+05:30 IST
రాష్ట్రంలో కరోనా ఉధృతి ఉన్నప్పటికీ.. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుతో తెలంగాణ సురక్షితంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీజనల్ వ్యాధులు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా ఉధృతి ఉన్నప్పటికీ.. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల అమలుతో తెలంగాణ సురక్షితంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీజనల్ వ్యాధులు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. సోమవారం తన కార్యాలయం నుంచి జిల్లాల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. పీఎంజీఎ్సవై కింద మొదటి దశలో 1028 కిలోమీటర్ల మేర 158 రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిలిచిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాగా, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ డీఎస్పీ శశిధర్ మృతి పట్ల ఎర్రబెల్లి సంతాపం తెలిపారు.