‘సదరం’ కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-07-28T05:04:06+05:30 IST

‘సదరం’ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దివ్యాంగులు వైద్యుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ధ్రువీకరణ పత్రాల కోసం స్థానిక సీహెచ్‌సీకి పదుల సంఖ్యలో దివ్యాంగులు వచ్చారు. అయితే ఆర్థోపెడిక్‌ వైద్యుడు మ ధ్యాహ్నం 3 గంటలకు వచ్చి వెంట నే వెళ్లిపోతుండగా తాము ప్రశ్నించామని 10 నిమషాల్లో వస్తానని చెప్పి సాయంత్రం ఐదు గంటల వరకు రాలేదని దివ్యాంగులు అప్పన్న, నాయుడు, రమణ తదితరులు వాపోయారు.

‘సదరం’ కోసం పాట్లు
ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులు

వైద్యుడి నిర్లక్ష్యంపై దివ్యాంగుల ఆగ్రహం

రాజాం రూరల్‌, జూలై 27: ‘సదరం’ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దివ్యాంగులు వైద్యుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ధ్రువీకరణ పత్రాల కోసం స్థానిక సీహెచ్‌సీకి పదుల సంఖ్యలో దివ్యాంగులు వచ్చారు. అయితే ఆర్థోపెడిక్‌ వైద్యుడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి వెంటనే వెళ్లిపోతుండగా తాము ప్రశ్నించామని 10 నిమషాల్లో వస్తానని చెప్పి సాయంత్రం ఐదు గంటల వరకు రాలేదని దివ్యాంగులు అప్పన్న, నాయుడు, రమణ తదితరులు వాపోయారు. కొన్ని వారాలుగా ఆసు పత్రి చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని వారు ఆరోపించారు. సుమారు 30 మంది దివ్యాంగులం వచ్చామని, చూసి సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరినా సదరు వైద్యుడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనివల్ల మరలా వారం తరువాత రావాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌నాయుడును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా నాకెవరూ ఫిర్యాదు చేయలేదని, సదరు వైద్యుడు సతీష్‌ సదరం విధులు నిర్వహించి వెళ్లిపోయారని అన్నారు. 

 

Updated Date - 2021-07-28T05:04:06+05:30 IST