ఈ రూల్స్‌ అప్పుడుంటేనా.. మరిన్ని పరుగులు వచ్చేవి

ABN , First Publish Date - 2020-05-13T09:57:30+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీకి అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా పేరుంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి గుర్తుచేసింది.

ఈ రూల్స్‌ అప్పుడుంటేనా.. మరిన్ని పరుగులు వచ్చేవి

సచిన్‌కు దాదా ట్వీట్‌


న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీకి అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా పేరుంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి గుర్తుచేసింది. తన ట్విటర్‌ పేజీలో వీరి ఘనతను పేర్కొంటూ.. ‘వన్డేల్లో సచిన్‌+సౌరవ్‌= 176 భాగస్వా మ్యాలు, 8,227 పరుగులు, 47.55 సగటు. మరే ఇతర ఓపెనింగ్‌ జోడీ కనీసం 6000 పరుగులు చేయలేక పోయింది’ అని ట్వీట్‌ చేసింది. అయితే సచిన్‌ ఈ ట్వీట్‌ను గంగూలీకి రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇప్పు డున్న రెండు కొత్త బంతులు.. సర్కిల్‌కు ఆవల నలుగురు ఫీల్డర్ల నిబంధన అప్పుడే ఉంటే మన జోడీ ఎన్ని పరుగులు సాధించేది?’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా దాదా.. ‘కనీసం మరో 4 వేల పరుగులైనా వచ్చేవి. రెండు కొత్త బంతులను తలుచుకుంటేనే.. తొలి ఓవర్‌లోనే కవర్‌ డ్రైవ్‌ ద్వారా బౌండరీ బాదినట్టుగా అనిపిస్తోంది. ఇక 50 ఓవర్లలో అయితే చెప్పేదేముంది’ అని దాదా ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-05-13T09:57:30+05:30 IST