అందుకు క్రీడలే సరైన వేదిక: సచిన్
ABN , First Publish Date - 2022-08-16T10:17:21+05:30 IST
కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అద్భుత విజయాలను ఆస్వాదించేందుకు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మించిన సందర్భం మరోటి ఉండబోదని దిగ్గజ క్రికెటర్ సచిన్.
ముంబై: కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అద్భుత విజయాలను ఆస్వాదించేందుకు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మించిన సందర్భం మరోటి ఉండబోదని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అందరికీ.. ముఖ్యంగా మహిళల అభివృద్ధికి క్రీడలు సరైన వేదికని పేర్కొన్నాడు. ఆత్మగౌరవం పెంపొందించుకొనేందుకు, ధైర్య సాహసాలు ప్రదర్శించడంతోపాటు పితృస్వామ్య అడ్డంకులను అధిగమించేందుకు క్రీడలు తోడ్పడతాయని స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని చేసిన ట్వీట్లో సచిన్ పేర్కొన్నాడు.