‘టీ20 టీం ఆఫ్ ది సీజన్’ను ప్రకటించిన సచిన్.. కనిపించని కోహ్లీ, రోహిత్శర్మ పేర్లు
ABN , First Publish Date - 2022-06-01T01:46:39+05:30 IST
ఈసారి ఐపీఎల్లో సంచనాలు నమోదయ్యాయి. హేమాహేమీలున్న జట్లు కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరుకోలేక ఇంటి ముఖం
ముంబై: ఈసారి ఐపీఎల్లో సంచనాలు నమోదయ్యాయి. హేమాహేమీలున్న జట్లు కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరుకోలేక ఇంటి ముఖం పడితే, అంచనాలు లేని జట్లు అనూహ్యంగా రాణించాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి కొత్త జట్లు అద్భుతాలు చేశాయి. చివరికి అరంగేట్రంలోనే కప్పు కొట్టి గుజరాత్ టైటాన్స్ సంచలనం సృష్టించింది. ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తన ‘టీ20 టీం ఆఫ్ ది సీజన్’ను ప్రకటించాడు.
ఈ జట్టుకు గుజరాత్ టైటాన్స్కు ట్రోఫీ అందించిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తీసుకున్నాడు. అలాగే, నాలుగు సెంచరీలతో అదరగొట్టిన జోస్ బట్లర్, నిలకడగా రాణించిన శిఖర్ ధవన్లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. అలాగే, ఈ జట్టులో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను మూడో స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్, దినేశ్ కార్తీక్ మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఉన్నారు. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ను బౌలర్లుగా ఎంచుకున్నాడు. ఈ సీజన్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సచిన్ జట్టులో స్థానం దక్కకపోవడం గమనార్హం.