జేపీ నడ్డాతో భేటీ కానున్న సచిన్ పైలెట్!
ABN , First Publish Date - 2020-07-13T13:13:10+05:30 IST
కాంగ్రెస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సోమవారం బీజేపీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తున్నట్లు సమాచారం. నడ్డాతో సమావేశమైన తర్వాత మాత్రమే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని సమాచారం. ఒకసారి నడ్డాతో భేటీ కావడమంటే ఇక అధికారికంగా కమలం గూటికి చేరినట్లేనని సీనియర్లు అంటున్నారు. నడ్డాతో పాటు మరికొందరు సీనియర్లతో కూడా పైలెట్ టచ్లో ఉన్నట్లు సమాచారం. బీజేపీ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. అయితే రాజస్థాన్లో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై బీజేపీ వేచిచూసే ధోరణితోనే ఉన్నట్లు సమాచారం.
రాజస్థాన్ లో రాజకీయం ముదిరి పాకాన పడిన విషయం తెలిసిందే. సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం పైలెట్ మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. బీజేపీ యువనేత సింధియా, తిరుగుబాటు నేత సచిన్ పైలెట్తో భేటీ అయిన విషయం తెలిసిందే. సచిన్ తో పాటు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్ లో ఉండగా, ఆదివారం ఉదయం మరో 12 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు.