కోహ్లీని మించినోళ్లు లేరు

ABN , First Publish Date - 2020-05-22T10:12:35+05:30 IST

వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ కంటే సచిన్‌ టెండూల్కరే ఉత్తమ బ్యాట్స్‌మన్‌ అని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. మాస్టర్‌ సుదీర్ఘ కెరీర్

కోహ్లీని మించినోళ్లు లేరు

న్యూఢిల్లీ: ఫార్మాట్‌ ఏదైనా...ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిస్సందేహంగా ‘గ్రే టెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ అని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ సర్ఫ్‌రాజ్‌ నవాజ్‌ ప్రశంసించాడు. సచిన్‌ రికార్డులను అతడు బద్ధలుగొడతాడని కూడా అభిప్రాయపడ్డాడు. ‘విరాట్‌ను ఎవరితోనూ పోల్చలేం. అన్ని ఫార్మాట్లలో అతడు సచిన్‌ రికార్డులను తిర గ రాస్తాడు. ఇన్‌స్వింగ్‌ బంతులను ఎదుర్కోవడంలో సచిన్‌ తడబడతాడు. కానీ కోహ్లీ బ్యాటింగ్‌లో తప్పులను వెతకలేం’ అని 1969 నుంచి 1984 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించిన నవాజ్‌ అన్నాడు.


వన్డేల్లో కోహ్లీ కన్నా సచిన్‌ మిన్న: గంభీర్‌

వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ కంటే సచిన్‌ టెండూల్కరే ఉత్తమ బ్యాట్స్‌మన్‌ అని టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. మాస్టర్‌ సుదీర్ఘ కెరీర్‌, ఆట నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే సచిన్‌వైపే మొగ్గుతానని చెప్పాడు.  సచిన్‌ 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. కోహ్లీ 248 వన్డేల్లో 59.33 సగటుతో 11,867 పరుగులు సాధించాడు.

Updated Date - 2020-05-22T10:12:35+05:30 IST