సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2020-12-02T16:58:21+05:30 IST

భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్...

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

కాన్‎బెర్రా: భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ రికార్డును బ్రేక్‌ చేశాడు. వన్డే‎ల్లో అత్యంత వేగంగా...తక్కువ వన్డేల్లో 12 వేల పరుగులను మైలురాయిని చేరుకున్న క్రికెటర్‎గా విరాట్ కోహ్లీ చరిత్రను సృష్టించాడు. ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఈ ఫీట్ సాధించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మొత్తం 309 వన్డేల్లో 12వేల పరుగులు చేయగా.. కోహ్లీ మాత్రం మొత్తం 250 వన్డేల్లో 12వేల పరుగులు చేసి రికార్డును అధిగమించాడు.

Updated Date - 2020-12-02T16:58:21+05:30 IST