బాసర ఘటనపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్

ABN , First Publish Date - 2022-06-15T17:46:10+05:30 IST

బాసర(Basara) ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) సీరియస్ అయ్యారు.

బాసర ఘటనపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్

హైదరాబాద్ : బాసర(Basara) ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) సీరియస్ అయ్యారు. సంబంధిత శాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. వీసీ(VC)పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవన్నారు. రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు బాసరలో కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాసరలో గోడ దూకి విద్యార్థులను రెచ్చ గొట్టి రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వీసీ ఏమైనా సమస్యలు సృష్టిస్తే తనకు ఫిర్యాదు చేయాలని సబిత సూచించారు. 


Updated Date - 2022-06-15T17:46:10+05:30 IST