సబర్మతీ తీరం... తాజ్‌ విహారం!

ABN , First Publish Date - 2020-02-20T09:14:39+05:30 IST

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 24న ఉదయం అహ్మదాబాద్‌లోని వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్‌ దిగుతారు. ఆయనకు ప్రధాని

సబర్మతీ తీరం... తాజ్‌ విహారం!

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈనెల 24న ఉదయం అహ్మదాబాద్‌లోని వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్‌ దిగుతారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతారు. తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని సబర్మతి ఆశ్రమం వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ట్రంప్‌ దాదాపు 25 నిమిషాలు ఆశ్రమంలో ఉంటారు. మహాత్మాగాంధీ నివసించిన కుటీరం ‘హృదయ కుంజ్‌’ను మొదట సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ట్రంప్‌ దంపతులు, ఇతర ప్రముఖులకు మోదీ విందు ఇస్తారు. తర్వాత ట్రంప్‌ దంపతులు ఆగ్రా వెళతారు. సాయంత్రం 5 గంటలకు వారు తాజ్‌మహల్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ 30 నుంచి 45 నిమిషాలు గడిపి ఢిల్లీ వెళతారు. 

Updated Date - 2020-02-20T09:14:39+05:30 IST