నవంబర్‌ 16 నుంచి శబరిమలయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-29T15:48:10+05:30 IST

నవంబర్‌ 16వ తేదీ నుంచి శబరిమలయాత్ర ప్రారంభం కానుంది.

నవంబర్‌ 16 నుంచి శబరిమలయాత్ర ప్రారంభం

కేరళ: నవంబర్‌ 16వ తేదీ నుంచి శబరిమలయాత్ర ప్రారంభం కానుంది. అయితే శబరిమలకు వచ్చే భక్తులు కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. వర్చువల్‌ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్టర్‌ చేసుకున్న వారికే ఆలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.


అయ్యప్పస్వామి దర్శనం అనంతరం భక్తులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ఉండేందుకు అవకాశం ఇవ్వబోమని, పంబానదిలో పుణ్యస్నానాలకు అనుమతి ఉండదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2020-09-29T15:48:10+05:30 IST