పరపతి రేటింగ్పై ప్రభావం
ABN , First Publish Date - 2021-05-06T06:37:50+05:30 IST
కొవిడ్ రెండో దశ ఉధృతితో భారత పరపతి రేటింగ్కు కోత పడే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ పరోక్ష హెచ్చరికలు చేసింది. ఎస్ అండ్ పీ ప్రస్తుతం భారత్కు ‘బీబీబీ-’ రేటింగ్ కొనసాగిస్తోంది...
- ఎస్ అండ్ పీ
న్యూఢిల్లీ: కొవిడ్ రెండో దశ ఉధృతితో భారత పరపతి రేటింగ్కు కోత పడే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ పరోక్ష హెచ్చరికలు చేసింది. ఎస్ అండ్ పీ ప్రస్తుతం భారత్కు ‘బీబీబీ-’ రేటింగ్ కొనసాగిస్తోంది. కొవిడ్ రెండో ఉధృతికి ముందే కేంద్ర-రాష్ట్రాల ద్రవ్య లోటు జీడీపీలో 14 శాతానికి, అప్పుల భారం 90 శాతానికి చేరిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే కొవిడ్ తొలి దశతో పోలిస్తే రెండో దశ ఉధృతిని ఎదుర్కొనేందుకు భారత కంపెనీలు ఆర్థికంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ రెండో దశ ఉధృతి ప్రభావంపై ఎస్ అండ్ పీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు 8.2 నుంచి 9.8 శాతం మించక పోవచ్చని స్పష్టం చేసింది. ఈ సంస్థ గతంలో ప్రకటించిన అంచనా 11 శాతం.