విధులకు రాని ముగ్గురికి మెమోలు
ABN , First Publish Date - 2021-06-20T03:16:45+05:30 IST
మండలంలోని అక్కంపేట సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు తహసీల్దార్ నాగరాజు శనివారం మెమోలు జారీ చేశారు. 11గంటలవు
మనుబోలు, జూన్ 19: మండలంలోని అక్కంపేట సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు తహసీల్దార్ నాగరాజు శనివారం మెమోలు జారీ చేశారు. 11గంటలవుతున్నా సచివాలయానికి ఉద్యోగులు ఎవరూ రాకపోవడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో గ్రామస్థులు సోషల్మీడియాలో ‘తెరుచుకోని సచివాలయం’ అంటూ పోస్టింగ్లు పెట్టారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ హుటాహుటిన అక్కంపేట సచివాలయం చేరుకున్నారు. అక్కడ మహిళాపోలీసు మినహా ఉద్యోగులెవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టి పరిశీలించి ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెలవుపెట్టకుండా విధులకు హాజరుకాని ముగ్గురు ఉద్యోగులకు మెమోలు ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు తెలిపి కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు. కార్యక్రమంలో వీఆర్వో జమునమ్మ, కార్యదర్శి వెంకటరమణలు పాల్గొన్నారు.