మోటార్లకు మీటర్లు బిగించొద్దు
ABN , First Publish Date - 2022-07-01T06:32:02+05:30 IST
వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రైతు సంఘం మండల కార్యదర్శి కైలే ఏసుదాసు డిమాండ్ చేశారు.
మోటార్లకు మీటర్లు బిగించొద్దు
రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
గన్నవరం, జూన్ 30: వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రైతు సంఘం మండల కార్యదర్శి కైలే ఏసుదాసు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుదాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులకు వ్యవసాయాన్ని దూరం చేయాలని కుట్ర పన్నిందన్నారు. రైతులంతా పోరాటం చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివస్తాయని తెలిపారు. ఆంధ్రా తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. బుద్ధవరం సర్పంచ్ బడుగు బాలమ్మ, కళ్లం వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ, జాస్తి శ్రీనివాసరావు, మధుసూదనరావు, తుల్లిమిల్లి తిరుపతయ్య, ఫ్రాన్సిస్, ఆంజనేయులు, రాంబాబు, జయమ్మ, సరస్వతి, తాతబ్బాయి పాల్గొన్నారు.