ఆర్బీకేలతో పీఏసీఎస్‌ల అనుసంధానం: సీఎస్‌

ABN , First Publish Date - 2021-02-26T08:58:03+05:30 IST

రాష్ట్రంలోని రైతుభరోసా కేంద్రాలను సహకార పరపతి సంఘాలతో అనుసంధానం చేసి, రైతాంగానికి మరిన్ని మెరుగైన సేవలందించేందుకు నాబార్డు, ఆప్కాబ్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

ఆర్బీకేలతో పీఏసీఎస్‌ల అనుసంధానం: సీఎస్‌

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతుభరోసా కేంద్రాలను సహకార పరపతి సంఘాలతో అనుసంధానం చేసి, రైతాంగానికి మరిన్ని మెరుగైన సేవలందించేందుకు నాబార్డు, ఆప్కాబ్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదేశించారు. గురువారం సచివాలయంలో గ్రామీణ సహకార పరపతి సంఘాలపై జరిగిన ద్వితీయ ఉన్నతస్థాయి కమిటీలో ఆయన మాట్లాడారు.  సహకార సంఘాలన్నింటినీ కంప్యూటరీకరణ చేయాలని, నష్టాల్లో ఉన్న పీఏసీఎ్‌సలను లాభాల బాట పట్టించాలని, కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నష్టాలు గట్టెక్కేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు మోసాలు, డిఫాల్ట్‌లు, నాన్‌బ్యాంకింగ్‌, ఇతర అంశాలపై సమీక్షించారు. 

Updated Date - 2021-02-26T08:58:03+05:30 IST