రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి
ABN , First Publish Date - 2020-12-02T04:26:35+05:30 IST
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించాలి
కొడంగల్: కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ నాయకుడు బుస్స చంద్రయ్య అన్నారు. మంగళవారం కొడంగల్లో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో రమేశ్బాబు, అంజిలప్ప, కే.చంద్రయ్య, రాములు, రాజు, వెంకటయ్య పాల్గొన్నారు.