రైలు ప్రయాణికురాలి మృతి

ABN , First Publish Date - 2021-10-20T02:56:27+05:30 IST

స్థానిక గూడూరు రైల్వేస్టేషన్‌లో మంగళవారం రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు అనారోగ్యంతో మృతిచెందిన

రైలు ప్రయాణికురాలి మృతి

గూడూరు, అక్టోబరు 19: స్థానిక గూడూరు రైల్వేస్టేషన్‌లో మంగళవారం రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు అనారోగ్యంతో మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసుల కథనం మేరకు... వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్రం మురిలియా గ్రామానికి చెందిన రమాబెనర్జీ(22)  కొంత కాలంగా అనేమియా  వ్యాధితో బాధపడుతోంది. అక్కడి వైద్యుల సలహామేరకు తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం పొందేందుకు ఆంధ్రా జంక్షన్‌ నుంచి కట్పాడికి విల్లీపురం ఎక్స్‌ప్రెస్‌లో ఆమె భర్త రాబిన్‌బెనర్జీతో కలిసి ప్రయాణిస్తున్నది. రైలు గూడూరు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు లోనైన రమాబెనర్జీ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే  పోలీసులు తెలిపారు.


---------

Updated Date - 2021-10-20T02:56:27+05:30 IST