సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ర్యాలీలు

ABN , First Publish Date - 2021-01-27T05:05:11+05:30 IST

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ర్యాలీలు

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ర్యాలీలు
నర్సంపేటలో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ. సీపీఎం, టీజేఎస్‌, సీపీఐఎంఎల్‌, సీపీఐఎంఎల్‌న్యూడెమో క్రసీ నాయకులు

నర్సంపేట, జనవరి 26 : కేం ద్రం రైతు వ్యతిరేక సాగు చట్టాల ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నర్సంపేట లో మంగళవారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి, సీపీఐ ఎం ఎల్‌, సీపీఐఎంఎల్‌, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేశ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, టీజేఎస్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కె జావిద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎ్‌ససీసీ జిల్లా కార్యదర్శి పి.రమేశ్‌,  బీఎల్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు కుమారస్వామి, ప్రణయదీ్‌పమాదిగ తదితరులు పాల్గొన్నారు.

 చెన్నారావుపేట: సాగు చట్టాలను నిరసిస్తూ ఎంసీపీఐయూ మండల నాయకుడు జన్ను రమేష్‌ ఆధ్వర్యంలో గొల్లబామతండా, గొల్లపల్లె ఆందోళన చేపట్టారు. కార్యక్రమం లో సాంబయ్య, రెడ్యానాయక్‌, రచ్చ నాయక్‌, హేమలత, భారతి పాల్గొన్నారు. 

 దుగ్గొండి: ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా తిమ్మంపేటలో ట్రాక్టర్ల ర్యాలీ, గిర్నిబావిలో బైక్‌ల ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పి.రమేశ్‌, ఎన్‌.కొమురయ్య. ప్రభాకర్‌, బాబురావు, విద్యాసాగర్‌, కర్ణాకర్‌రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సంగెం: అఖిల భారత రైతు సంఘం పోరాటసమితి ఆధ్వర్యంలో మండల కేం ద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్మాయిల్‌ గోనే రాంచందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:05:11+05:30 IST