రుయాకు ‘అమర రాజ’ చేయూత

ABN , First Publish Date - 2020-03-29T11:15:51+05:30 IST

రుయాస్పత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం అమరరాజ సంస్థ చేయూతనిచ్చింది.

రుయాకు ‘అమర రాజ’ చేయూత

 రూ.5లక్షల విలువ చేసే వైద్య 

పరికరాల అందజేత


తిరుపతి (వైద్యం), మార్చి 28: రుయాస్పత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం అమరరాజ సంస్థ చేయూతనిచ్చింది. శనివారం కలెక్టర్‌ భరత్‌ గుప్తా సమక్షంలో రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్వీ రమణయ్యకు ఆ సంస్థ ప్రతినిధులు రూ.4.22 లక్షల విలువైన శానిటైజర్లు, మాస్కులను అందజేశారు. వీటిల్లో డిస్పోజబుల్‌ మాస్కులు 300, ఎన్‌-95 మాస్కులు 1,000, శానిటైజర్‌ 100 లీటర్లు, డిస్పోజబుల్‌ నైట్రిల్‌ గ్లౌజులు 500 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ హరికృష్ణ, వైద్యులు శ్రీనివాసరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:15:51+05:30 IST