కైవ్లో పౌరుల కారుపై Russian దళాల కాల్పులు...ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2022-03-05T17:46:17+05:30 IST
ఉక్రెయిన్ దేశంపై సైనికచర్యకు దిగిన రష్యా సైనికులు పౌరుల కార్లపైనా కూడా కాల్పులు జరిపారు....
మరో నలుగురికి గాయాలు
కైవ్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై సైనికచర్యకు దిగిన రష్యా సైనికులు పౌరుల కార్లపైనా కూడా కాల్పులు జరిపారు. శనివారం ఉదయం ఉక్రెయిన్ దేశ రాజధాని నగరమైన కైవ్కు సమీపంలోని బుచా జిల్లాలో రష్యన్ సైనికులు ఓ ప్రైవేటు కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరణించిన వారిలో 17 ఏళ్ల బాలిక కూడా ఉంది. రష్యా సేనల దాడుల్లో మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఇర్పిన్ పట్టణంలోని మిలటరీ ఆసుపత్రిపై రష్యా సైనికులు బాంబులతో దాడి చేశారు.