ఉక్రెయిన్‌ యుద్ధంలో టాప్ మేజర్ జనరల్‌ను కోల్పోయిన రష్యా

ABN , First Publish Date - 2022-03-03T21:38:06+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారీ నష్టం జరిగింది. మేజర్ జనరల్

ఉక్రెయిన్‌ యుద్ధంలో టాప్ మేజర్ జనరల్‌ను కోల్పోయిన రష్యా

కీవ్ : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు భారీ నష్టం జరిగింది. మేజర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ ఆండ్రీ సుఖొవెట్‌స్కీయి ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో  రష్యా దళాలు అత్యున్నత స్థాయి నేతను కోల్పోవడం  ఇదే మొదటిసారి. రష్యన్ ఎయిర్‌బోర్న్ ట్రూప్స్‌ మౌంటెన్ ఎయిర్ అజాల్ట్‌కు చెందిన నోవోరోస్సియ్‌స్క్ గార్డ్స్ కమాండర్‌గా ఆండ్రీ సేవలందించారు.  ఈ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించవలసి ఉంది. 


ఈ యుద్ధంలో 498 మంది సైనికులను కోల్పోయినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ విడుదల చేసిన ప్రకటనలో 9,000 మందికిపైగా రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ యుద్ధం గురువారం ఎనిమిదో రోజుకు చేరింది. 


Updated Date - 2022-03-03T21:38:06+05:30 IST