టీవీ టవర్‌పై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన సేవలు

ABN , First Publish Date - 2022-03-02T03:08:29+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఉన్న భారీ టీవీ టవర్‌పై రష్యా దాడి చేసింది. టీవీ టవర్ ధ్వంసం కావడంతో ఉక్రెయిన్‌ దేశ వ్యాప్తంగా కొద్ది నిమిషాల క్రితమే టీవీ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. రాజధాని కీవ్‌పై దాడులు తీవ్రం చేస్తామని రష్యా ముందుగానే..

టీవీ టవర్‌పై రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన సేవలు

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఉన్న భారీ టీవీ టవర్‌పై రష్యా దాడి చేసింది. టీవీ టవర్ ధ్వంసం కావడంతో ఉక్రెయిన్‌ దేశ వ్యాప్తంగా కొద్ది నిమిషాల క్రితమే టీవీ సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. దానితో పాటు ఈ దాడిలో ఐదుగురు మరణించినట్లు తెలిసింది. రాజధాని కీవ్‌పై దాడులు తీవ్రం చేస్తామని రష్యా ముందుగానే ప్రకటించింది. అంతే కాకుండా కీవ్‌ విడిచి వెళ్లిపోవాలని స్థానిక ప్రజలకు హెచ్చరికలు చేసింది. అనుకున్నట్లుగానే మంగళవారం సాయంత్రం రాజధానిలో దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్‌కు చెందిన పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు రష్యా పౌరులపై సైబర్ దాడులకు దిగుతూ సమాచారాన్ని చోరీ చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా రాజధాని కీవ్‌లోని 'సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ సైకలాజికల్ ఆపరేషన్స్'పై దాడికి పాల్పడినట్లు రష్యా పేర్కొందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-03-02T03:08:29+05:30 IST