యాదాద్రిలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-07-18T21:34:18+05:30 IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసర ప్రాంతాలు  క్యూలైన్లు భక్తులతో సందడిగా కనిపిస్తున్నాయి. నిత్య కల్యాణం, సుదర్శన నరసింహ హోమం, అష్టోత్తరం పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండ కింద వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులు కోలాహలం కనిపిస్తుంది. స్వామివారిని ధర్మ దర్శనానికి దాదాపు 2 గంటల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట వరకు సమయం పడుతోంది. స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Updated Date - 2021-07-18T21:34:18+05:30 IST