కిటకిటలాడిన నత్తారామేశ్వరం, జుత్తిగ దేవాలయాలు
ABN , First Publish Date - 2022-05-17T05:23:00+05:30 IST
నత్తారామేశ్వరంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
పెనుమంట్ర, మే 16: నత్తారామేశ్వరంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామునుంచి భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది. కాశీభట్ల సూర్యనారాయణమూర్తి, సత్తిబాబు, రామేశ్వరపు రామలింగేశ్వరరావు పూజలు చేశారు. భక్తుల సహకారంతో పులిహోర, చక్కెర పొంగలి, మజ్జిగ అందజేశారు. జుత్తిగ ఉమావాసుకీ రవిసోమేశ్వర స్వామివారికి భక్తులు పూజలు చేయించుకున్నారు. ఆలయ అర్చకులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు చేశారు.