పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-03-07T05:10:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు క లెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత
మాక్లూర్, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి న పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు క లెక్టర్ బీఎస్ లత అధికారులను ఆదేశించారు. శనివారం మండ ల కేంద్రంలోని మాక్లూర్, మామిడిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను, చిన్నపూర్లోని అర్బన్ పార్కును, మాక్లూర్ చెరువు లో చేపట్టిన ఈజీఎస్, పంప్హౌజ్ పనులను, వైకుంఠధామాన్ని ఆమె పరిశీలించారు. వైకుంఠధామంలోని అదనపు గదులను వె ంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో ఇన్చార్జి ఎంపీడీవో పీవీ రమణ, ఇన్చార్జి ఈసీ వరగం గ, టీఏ స్వప్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.