అతడి వల్లే ఐపీఎల్‌లోకి కరోనా..?

ABN , First Publish Date - 2021-05-07T02:31:29+05:30 IST

కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నెల రోజులుగా టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ.. కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఉన్నట్లుండి..

అతడి వల్లే ఐపీఎల్‌లోకి కరోనా..?

ఇంటర్నెట్ డెస్క్: కరోనా దెబ్బకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నెల రోజులుగా టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ.. కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా.. జట్లలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అవాక్కయిన ఐపీఎల్ యాజమాన్యం వెంటనే టోర్నీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బీసీసీఐకి వేల కోట్ల నస్టం వచ్చింది. అయితే ఇంత నష్టం వచ్చినా ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు అంతా కలిసి టోర్నీ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


ఈ నెల 1న అహ్మదాబాద్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నట్లుండి అస్వస్థతకు గురి కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. భుజం స్కానింగ్ కోసం అతడు ఆసుపత్రికి వెళ్లినట్లు అదికారికంగా నమోదైనా.. కడుపులో సమస్య ఏర్పడడంతో వల్ల హోటల్ నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. స్కానింగ్ పూర్తి చేసుకొని కాసేపటికి వరుణ్ హోటల్‌కు తిరిగి వచ్చాడు. అయితే బయోబబుల్ రూల్ ప్రకారం ఎవరైనా అలా బయటకు వెళితే అతడు కచ్చితంగా మిగతా టీంతో కలవకూడదు.


ఇక చెన్నై జట్టులో కరోనా ఎలా సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ జట్టు సభ్యుడు చేసిన చిన్న పొరపాటు, ఐపీఎల్ పాలకమండలి నిర్లక్ష్యం.. వెరసి టోర్నీ రద్దుకు, వేలాది కోట్ల నష్టానికి దారి తీసింది.


ఇంతవరకు బాగానే ఉన్నా.. గతేడాది యూఏఈలో ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిన టోర్నీ ఈ ఏడాది మాత్రం ఎందుకు ఇలా అర్థాంతరంగా ముగిసిపోయిందనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. అసలు పటిష్ఠమైన బయోబబుల్‌లోకి కరోనా ఎలా ప్రవేశించిందనే ఆనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే బీసీసీఐ విచారణను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ విచారణకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.


వారం రోజులు ఐసోలేషన్లో ఉండి, కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చాకే.. జట్టుతో కలవాలి. కానీ రూల్ బ్రేక్ చేసినా అతడు జట్టుతో కలిసిపోయాడు. ఆ తర్వాత స్టేడియంకు అందరితో కలిసి బస్సులో బయలుదేరాడు. మద్యలో సందీప్ వారియర్‌తో కలిసి ఓ హోటల్లో భోజనం చేశాడు. అయితే స్టేడియం చేరుకున్న తరువాత తన ఆరోగ్యం సరిగా లేదని, ప్రాక్టీస్ చేయలేనని చెప్పడంతో విశ్రాంతి తీసుకున్నాడు. మిగతా వారంతా ప్రాక్టీస్‌కు వెళ్లిపోయారు.


అయితే అదే సమయంలో ఆ మైదానంలో ఢిల్లీ క్యాపిల్స్  దీనికి తోడు బయోబబుల్ రూల్స్‌లో మరొకటి ఏ రెండు జట్లూ కలిసి ప్రాక్టీస్ చేయకూడదు. కానీ కేకేఆర్ ప్రాక్టీస్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఢిల్లీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే బయోబబుల్ రూల్ ప్రకారం.. మ్యాచ్ ముందు రెండు జట్లు కలవకూడదు. కానీ ఇక్కడ మరో రూల్ బ్రేక్ అయింది. కేకేఆర్ ఆటగాళ్లు ఢిల్లీ ఆటగాళ్లను కలిశారు. 


వరణ్‌తో కలిసి భోజనం చేసిన సందీప్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలవగా.. ఇద్దరు కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత హోటల్ గదికి వచ్చిన మిశ్రాకు అస్వస్థతకు గురయ్యాడు. అంతలోనే సందీప్‌ ఆరోగ్యం కూడా క్షీణించింది. వరుణ్ ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. దీంతో వారు ముగ్గురికీ హుటాహుటిన కరోనా పరీక్ష నిర్వహించిన వైద్యులు పాజిటివ్ అని తేల్చారు. 

Updated Date - 2021-05-07T02:31:29+05:30 IST