డిగ్రీ అధ్యాపకురాలిగా రుద్రమరాణి
ABN , First Publish Date - 2021-04-12T05:07:01+05:30 IST
జమ్ము గ్రామానికి చెందిన సాధు చిన్న ప్పల స్వామి మాస్టారు కుమార్తె రుద్రమరాణి ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో డిగ్రీ అధ్యాపకురాలిగా జోన్-1లో టాపర్ గా నిలిచి బోటనీ విభాగం నుంచి ఎంపికయ్యారు.
ఏపీపీఎస్సీ జోన్-1లో టాపర్గా ఎంపిక
నరసన్నపేట: జమ్ము గ్రామానికి చెందిన సాధు చిన్న ప్పల స్వామి మాస్టారు కుమార్తె రుద్రమరాణి ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో డిగ్రీ అధ్యాపకురాలిగా జోన్-1లో టాపర్ గా నిలిచి బోటనీ విభాగం నుంచి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమె పోలాకి మం డలం పిరువాడ పాఠశాల హెచ్ ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. గత సెప్టెంబరులో మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన రుద్రమరాణి ఇంటర్వ్యూకు ఎంపిక కాగా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ నిర్వహించగా అందులోనూ ప్రతిభ కనబరిచి డిగ్రీ కళాశా ల లెక్చరర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాఽధ్యాయులు అభినందించారు. ఈమె భర్త బుచ్చిరాజు జలుమూరు మండలం స్టాటస్టికల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈమె సోదరుడు సాధు శిబి చక్రవర్తి మేఘాలయ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. సోదరుడు, భర్త ప్రోత్సాహంతోనే తాను తొలి ప్రయత్నంలోనే డిగ్రీ కళాశాల లెక్చరర్గా ఎంపికయ్యానని రుద్రమరాణి పేర్కొన్నారు. రుద్రమరాణి ఎంపికపై తల్లి కృష్ణవేణి, భర్త, సోదరులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు అభినందించారు.