రుయా ఆస్పత్రి మృతులకు నివాళి

ABN , First Publish Date - 2021-05-13T05:13:14+05:30 IST

కరోనా వైరస్‌ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు.

రుయా ఆస్పత్రి మృతులకు నివాళి
నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

గాజువాక, మే 12: కరోనా వైరస్‌ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. రుయా ఆస్పత్రిలో మృతి చెందిన వారికి సంతాపంగా 73వ వార్డు టీడీపీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వలన చాలామంది ప్రాణాలు కొల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నమ్మి సింహాద్రి, వియ్యపు కొండబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-13T05:13:14+05:30 IST