ములకలచెరువు నుంచి రాయచోటికి ఆర్టీసీ సర్వీసు

ABN , First Publish Date - 2022-08-18T04:20:54+05:30 IST

ములకలచెరువు నుంచి తంబళ్ళపల్లె, పెద్దమండ్యం మీదుగా రాయచోటికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభ మైంది. ములకలచెరువు బస్టాండు సర్కిల్‌లో బుధవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వాకరనాఽథరెడ్డి పూజలు నిర్వహించి కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు.

ములకలచెరువు నుంచి రాయచోటికి ఆర్టీసీ సర్వీసు
ములకలచెరువు- రాయచోటి ఆర్టీసీ బస్సు

ములకలచెరువు, ఆగస్టు 17: ములకలచెరువు నుంచి తంబళ్ళపల్లె, పెద్దమండ్యం మీదుగా  రాయచోటికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభ మైంది. ములకలచెరువు బస్టాండు సర్కిల్‌లో బుధవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వాకరనాఽథరెడ్డి పూజలు నిర్వహించి కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సు సర్వీసు  పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్ద మండ్యం మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద న్నారు. మదనపల్లె వన్‌ డిపో మేనేజర్‌ వెంటకరమణారెడ్డి మాట్లాడు తూ కొత్త బస్సు సర్వీసు ప్రతి రోజు ఉదయం మదనపల్లెలో ఆరు గంటలకు బయలుదేరి ములకలచెరువుకు వస్తుందన్నారు. ములకల చెరువు నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తంబళ్లపల్లె, పెద్ద మండ్యం, గాలివీడు మీదుగా 10.40కి రాయచోటికి చేరుకుంటుంద న్నారు. రాయచోటిలో 11 గంటలకు బయలుదేరి 1.10కి తంబళ్ళపల్లెకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 1.30కి బయలుదేరి 3.48కి రాయ చోటికి చేరుకుంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాయ చోటిలో బయలుదేరి గాలివీడు, పెద్దమండ్యం, తంబళ్ళపల్లె మీదుగా 7.10 గంటలకు ములకలచెరువుకు వస్తుందన్నారు.  7.30 గంటలకు మదనపల్లెకు బయల్దేరి వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయి లీల, ఎంపీడీవో రయేష్‌బాబు, సర్పంచులు రహమత్‌బీ, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంబాబునాయుడు, మాజీ సర్పంచ్‌ రవీంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డాక్టర్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T04:20:54+05:30 IST