ముస్లిం సిబ్బందికి ఆర్టీసీ రంజాన్ కానుక
ABN , First Publish Date - 2021-04-16T09:10:47+05:30 IST
రంజాన్ సందర్భంగా.. ఆర్టీసీ పరిపాలన కార్యాలయాల్లో పని చేస్తున్న ముస్లిం సిబ్బంది సాయంత్రం గంట ముందుగానే(4గంటలకు) ఇళ్లకు వెళ్లిపోవచ్చు
హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రంజాన్ సందర్భంగా.. ఆర్టీసీ పరిపాలన కార్యాలయాల్లో పని చేస్తున్న ముస్లిం సిబ్బంది సాయంత్రం గంట ముందుగానే(4గంటలకు) ఇళ్లకు వెళ్లిపోవచ్చు. బస్ భవన్, రీజనల్, డివిజనల్ కార్యాలయాలు, డిపోల్లోని వారికి ఈ వెసులుబాటు కల్పిస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.