నేటి నుంచే మహిళలకు RTC ఆఫర్స్
ABN , First Publish Date - 2022-03-08T12:11:03+05:30 IST
నేటి నుంచే మహిళలకు RTC ఆఫర్స్
హైదరాబాద్ సిటీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసీ మంగళవారం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఈ నెల 14 వరకు ట్రావెల్ టీ 24 టికెట్లపై 20 శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది. మూడు రూట్లలో మహిళల కోసమే మెట్రో, ఎక్స్ప్రెస్ ట్రిప్పులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రైవర్ వెనక పర్పుల్ కలర్లో మహిళల కోసం రెండు ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఈసీఐఎల్ నుంచి మెహిదీపట్నం, ఎన్జీవోస్ కాలనీ నుంచి సికింద్రాబాద్, జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ రూట్లలో మహిళా స్పెషల్ బస్సులు నడపనున్నారు. కాగా, దూరప్రాంత ప్రయాణికులకు బోర్డింగ్ పాయింట్లలో ప్రత్యేక సేవలను సోమవారం గ్రేటర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రయాణికులు సేద తీరేందుకు ఆహ్లాదకరమైన నిరీక్షణ హాలు, స్నాక్స్, తాగునీరు సౌకర్యాలు కల్పించామన్నారు.