సంక్రాంతికి 4వేల ప్రత్యేక బస్సులు: Sajjanar

ABN , First Publish Date - 2022-01-10T19:26:37+05:30 IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత గ్రామాలకు వెళ్లే వారిని కోసం నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

సంక్రాంతికి 4వేల ప్రత్యేక బస్సులు: Sajjanar

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం నాలుగు వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఏబీఎన్‌తో సజ్జనార్ మాట్లాడుతూ... సాధారణ చార్జీలు ఉండడంతో ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. రెండు రోజుల్లో 5 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అన్నారు. బస్టాండ్ల ఆవరణలో ఉన్న హోటళ్లు, స్టాల్స్‌లో వస్తువులు, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. బస్టాండ్లలో పార్కింగ్ చార్జీలు పెంచితే ఉపేక్షించమని సజ్జనార్ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-10T19:26:37+05:30 IST