ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు: Sajjanar

ABN , First Publish Date - 2021-11-30T17:26:34+05:30 IST

బస్సు డిపోలను మూసేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.

ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదు: Sajjanar

హైదరాబాద్: బస్సు డిపోలను మూసేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. అలాంటి ఆలచన ఆర్టీసీ యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆర్టీసీ వైపు మళ్లుతున్నారన్నారు. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆదాయం పెరిగిందని, ఓఅర్ కూడా పెరిగిందని ఆర్టీసీ ఎండీ అన్నారు. 1359 రూట్లలో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించామని చెప్పారు. బస్సులు అవసరం ఉన్న చోట లోకల్ డీఎం, ఆర్ఎంలు సర్వే చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువ..కొన్నిచోట్ల ఎక్కువ ఉందని తెలిపారు.


ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డీఎంను సంప్రదించాలని సూచించారు. జోగులంబ వెళ్ళినప్పుడు భక్తులు బస్సు అడిగారని.. వచ్చే శనివారం నుండి జోగులంబకు  హైదరాబాద్ నుండి స్పెషల్ బస్సు నడువనున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు. డీజిల్ పెరుగుదగల, కరోన వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యమన్నారు. సీబీఎస్ హాంగర్ ప్లేస్‌లో  కాంప్లెక్స్ నిర్మాణంపై ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. బస్‌స్టాండ్‌లలో ఎలాంటి పార్కింగ్ దందా లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. 


Updated Date - 2021-11-30T17:26:34+05:30 IST