ఆర్టీసీ డిపోలో భోజనశాల ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-18T03:46:45+05:30 IST
కావలి ఆర్టీసీ డిపోలో భోజనశాలను బుధవారం డీఎం ఆర్. శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు, కం
కావలిటౌన్, ఆగస్టు17: కావలి ఆర్టీసీ డిపోలో భోజనశాలను బుధవారం డీఎం ఆర్. శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు భోజనం చేసేందుకు భోజనశాలకు ఒక గదిని కేటాయించి, అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, అసిస్టెంట్ మేనేజర్ కేవీఆర్ బాబు, ట్రాఫిక్ సూపరింటెండెంట్ రామకృష్ణ కార్మిక నాయకుడు సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.