Visakha APSRTC.. ఆన్ కాల్ డ్యూటీ డ్రైవర్స్ నిరసన

ABN , First Publish Date - 2022-07-15T20:16:48+05:30 IST

ఆర్టీసీలో పనిచేస్తున్న ఆన్ కాల్ డ్యూటీ డ్రైవర్స్ శుక్రవారం నిరసన చేపట్టారు. విశాఖలో సీఎం జగన్ శుక్రవారం పర్యటించారు.

Visakha APSRTC.. ఆన్ కాల్ డ్యూటీ డ్రైవర్స్ నిరసన

విశాఖ: ఏపీ ఆర్టీసీ(APSRTC)లో పనిచేస్తున్న ఆన్ కాల్ డ్యూటీ డ్రైవర్స్ శుక్రవారం నిరసన చేపట్టారు. విశాఖ(Visakha)లో సీఎం జగన్(CM JAGAN) శుక్రవారం పర్యటించారు. సీఎం పాల్గొన్న మీటింగ్‌కు ఈ డ్రైవర్లు వచ్చారు. సీఎం జగన్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించాలని మీటింగ్‌కి వస్తే పోలీసులు సీఎంని కలవనీయకుండా అడ్డుకున్నారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. సీఎంని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో డ్యూటీ డ్రైవర్స్ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-15T20:16:48+05:30 IST