ఆర్టీసీ ఈయూ కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2021-03-01T05:13:31+05:30 IST
నెక్ రీజియన్లో తిరుగుతున్న తొమ్మిది ఆర్టీసీ బస్సు రూట్ల్లో సర్వేచేసి రన్నింగ్ కాలాన్ని నిర్ణయించాలని ఎం ప్లాయీస్ యూనియన్ రీజియన్ నాయకులు బాసూరు కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు.
పాలకొండ: నెక్ రీజియన్లో తిరుగుతున్న తొమ్మిది ఆర్టీసీ బస్సు రూట్ల్లో సర్వేచేసి రన్నింగ్ కాలాన్ని నిర్ణయించాలని ఎం ప్లాయీస్ యూనియన్ రీజియన్ నాయకులు బాసూరు కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. పాలకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఎం ప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు ఆదివారం ధర్నా చేశారు. పలాస, పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపోల్లో సూపర్వైజర్లను బెదిరింపులకు గురిచేసిన వారిపై సర్వేచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.