ఆర్టీసీ ఈయూ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2020-07-12T10:23:48+05:30 IST
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్మికులు శనివారం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర
కర్నూలు(రూరల్), జూలై 11: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్మికులు శనివారం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, మద్దిలేటి, రీజనల్ కార్యదర్శి ఏవీ రెడ్డి హాజరై కర్నూలు-1,2 డిపో వద్ద ఈయూ జెండాను ఎగరవేశారు. 1952 జూలై 11న యూనియన్ను స్థాపించారని అన్నారు. అంతకు ముందు కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. ఈయూ నాయకులు మహేశ్వరరావు, రబ్బాని, ఇజాజ్, ఆర్వీఎం రావు, చంద్ర పాల్గొన్నారు.