50 శాతం రాయితీపై సరుకు రవాణా

ABN , First Publish Date - 2020-11-29T06:20:01+05:30 IST

ఏభై శాతం రాయితీపై సరుకు రవాణా చేయనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎ.గిరిధరకుమార్‌ చెప్పారు.

50 శాతం రాయితీపై సరుకు రవాణా
మాట్లాడుతున్న డీఎం గిరిధరకుమార్‌

ఆర్టీసీ డీఎం గిరిధరకుమార్‌


అనకాపల్లి టౌన్‌, నవంబరు 28: ఏభై శాతం రాయితీపై సరుకు రవాణా చేయనున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎ.గిరిధరకుమార్‌ చెప్పారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రవాణా చార్జీలు పెరగడం వల్ల సరుకు రవాణా ఆదాయం లేకుండా పోయిందన్నారు. దీనిపై సర్వే చేయగా 50 శాతానికి తగ్గించి రవాణా చేసేందుకు నిర్ణయించామన్నారు. అనకాపల్లి నుంచి విశాఖకు పది టన్నుల సరుకు రవాణాకు చార్జీ రూ.10 వేలు వసూలు చేసేవారమని, ఇప్పుడు రూ.5 వేలుకే చేస్తామని చెప్పారు. 200 కిలోమీటర్ల వరకు సరుకు రవాణా రూ.100 ఉంటే, ఇప్పుడు రూ.50 చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. సరుకు రవాణా చేసుకునే వారు 7382913696, 9393535358 నంబర్లను సంప్రతించాలని కోరారు. 

Updated Date - 2020-11-29T06:20:01+05:30 IST