ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2022-07-03T06:38:32+05:30 IST

పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసన

జిల్లావ్యాప్తంగా టీడీపీ ప్రదర్శనలు, ర్యాలీలు

ఆర్టీసీ కాంప్లెక్స్‌  వద్ద వామపక్షాల ఆందోళన


పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. దక్షిణ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాజువాకలో నిరసన ర్యాలీ జరిగింది. భీమిలి చిన్నబజారు జంక్షన్‌లో నేతలు ఆందోళన నిర్వహించారు. పెందుర్తిలో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆందోళన చేశారు. కాగా వామపక్షాల నేతలు చార్జీల పెంపుపై నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. పెంచిన చార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. 



Updated Date - 2022-07-03T06:38:32+05:30 IST