సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2021-06-10T13:12:27+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ ఊపిరి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ ఊపిరి పీల్చుకుంది. ఇవ్వాళ్టి నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్నాయి. దీంతో సాయంత్రం 6 గంటల వరకు యథావిధిగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ సంస్థ పేర్కొంది. నగరంలో 12 వందల బస్సులతో పాటు జిల్లాకు 3,600 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రయాణికులతో బస్టాండ్లు మళ్లీ కళకళ లాడుతున్నాయి. బస్సుల సంఖ్య పెంపుతో నగర ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.